కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు నియోజవర్గాల్లో పోలింగ్ వాయిదా పడింది. మిగతా 222 నియోజకవర్గాల్లో పోలింగ్ శనివారం ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆర్ఆర్ నియోజకవర్గంలో 9వేల నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులను జప్తు చేసిన నేపథ్యంలో పోలింగ్ను వాయిదా వేశారు. జయనగర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి విజయకుమార్ మృతితో ఎన్నిక వాయిదా పడింది. బెలుర్ నియోజకవర్గంలోని పడువళలు పోలింగ్ కేంద్రంలో ఇవిఎంలు మొరాయించడంతో పోలింగ్ జాప్యమైంది. అక్కడికి లోపాలు లేని ఇవిఎంలు పంపాలని పోలింగ్ సిబ్బంది అధికారులను కోరారు. ఇవిఎంలు వచ్చే వరకు వేచి ఉండాలని ఓటర్లకు పోలింగ్ సిబ్బంది సూచించారు. మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ, ఆయన కుటుంబ స భ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన హొళేనర్సిపూర్ నియోజకవర్గంలోని పడువళహిప్పే పోలింగ్ కేంద్రంలో కూడా ఇవిఎంలు మొరాయించి పోలింగ్ నిలిపారు. ఉదయం 7.45 గంటల వరకు అక్కడ 29 మంది ఓటు హక్కును వినియోగిచుకున్నాక ఈ సమస్య తలెత్తింది. సీనియర్ అధికారులు అక్కడికి చేరుకుని ఇవిఎంలు మార్పు చేసి పోలింగ్ను పున:ప్రారంభింపజేశారు.