రాష్ట్రంలో కనీసం 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. నిరుద్యోగ భృతిపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి కొల్లు మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ భృతిని వీలైనంత త్వరలో అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి విధివిధానాలపై కసరత్తు చేస్తున్నామని ఆయన అన్నారు. వయోపరిమితి, విద్యార్హత ఎలా ఉండాలనే అంశంపై చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. నిరుద్యోగ భృతి చెల్లింపు పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.