ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1,511 పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 28, 2018, 04:21 PM

ఏపీలోని 1,511 పంచాయతీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం (ఏప్రిల్ 27) ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,565 పోస్టుల భర్తీకిగాను, 1054 భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన 1511 పోస్టులను మాత్రం కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


ఈ పోస్టులకు పోటీ పడేవారు రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. కనీస విద్యార్హతగా డిగ్రీ ఉండాలి. మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇందులో మెరిట్ (అకడమిక్)కు 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం మార్కులు ఉంటాయి. ఎంపికైనవారికి నెలకు రూ.15,000 జీతం ఉంటుంది. కాంట్రాక్ట్ ప్రకారం వీరు ఏడాదిపాటు పనిచేయాల్సి ఉంటుంది. పనితీరు సరిగాలేనివారిని తొలగించే అధికారం అధికారులకు ఉంటుంది. జిల్లా స్థాయి కమిటీకి ఛైర్మన్‌గా కలెక్టర్‌, సభ్యులుగా జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈవో), జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com