తిరుమల: తిరుమల శ్రీవారిని ఎపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం ఉదయం దర్శించుకున్నారు. శ్రీవారి తీర్థప్రసాదాలను టిటిడి అధికారులు మంత్రికి అందజేశారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదికి టిటిడి రూ.2.50 కోట్ల పన్ను చెల్లిస్తోందన్నారు. టిటిడికి మినహాయింపు ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్లో చర్చిస్తామని మంత్రి యనమల తెలిపారు.