ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లఖీంపూర్ ఖేరీలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో టెంపోలో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో టెంపో వ్యానులో 17 మంది ప్రయాణికులు ఉన్నారు.