న్యూఢిల్లీ : వైకాపా ఆంధ్రప్రదేశ్ లో గట్టి పట్టు ఉన్న పార్టీ అని కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి వైదొలగడం బాధాకరమన్నారు. అయితే ఆ పార్టీ ఆరోపిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏమీ అన్యాయం చేయలేదని అధవాలే చెప్పారు. ఏపీకి సాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అయితే ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి ఆ హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలూ కావాలంటాయని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీయేలోకి వస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.