వినీతిని అరికట్టగలిగితేనే రాష్టాభివృద్ది సాధ్యమవుతుందని అవినీతి నిరోధక శాఖ డీజీ ఠాకూర్ అన్నారు. నెల్లూరు ఏసీబీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన జిల్లాలో పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను డీఎస్పీ తోట ప్రభాకర్ ను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా పరిషత్ సీఈవో రామిరెడ్డి కేసును త్వరలోనే పైనలైజ్ చేస్తామన్నారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఏసీబీలో సిబ్బంది కొరత ఉందని త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామన్నారు.