వడోదర: గుజరాత్లోని వడోదరకు చెందిన డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ మొత్తం 11 బ్యాంకులకు సుమారు 2654 కోట్లు ఎగవేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ రూ.1122 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఆ కంపెనీపై మనీల్యాండరింగ్ కేసును రిజిస్టర్ చేశారు. దాని ఆధారంగానే ఈ ఆస్తులను అటాచ్ చేశారు. డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రమోటర్ ఎస్ఎన్ భాట్నగర్తో పాటు ఆయన ఇద్దరు కుమారులు అమిత్ భట్నగర్, సుమిత్ భట్నగర్ నిందితులుగా ఉన్నారు. కేబుల్స్తో పాటు ఇతర విద్యుత్తు పరికరాలను కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీని చెందిన ప్రాపర్టీలను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారి తెలిపారు.