విజయవాడ: కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ సోమవారం విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఆంధ్రా కాంక్లేవ్ సదస్సుకు అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఇందుకు సంబంధించి మిజోరాం, ఒడిశా ఆర్థికమంత్రులతో యనమల మాట్లాడుతున్నారన్నారు. 15వ ఆర్థిక సంఘం నిర్ణయాల వల్ల ఉత్త ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు రూ.80వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఏబీఎన్తో థామస్ అన్నారు.