కామాంధులకు ఉరిశిక్ష విధించాలని అనేక సార్లు మోడీకి లేఖ రాశానని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. చిన్నారులు, మహిళలపై అత్యాచారం చేస్తే కఠిన శిక్షలు తప్పవంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే చిన్న పిల్లలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కఠిన శిక్షలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని కోరారు. ప్రతి మండలంలో మహిళా పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. మహిళల రక్షణ చర్యలపై రేపు సీఎం చంద్రబాబు దగ్గర సమావేశం జరుగనున్నట్లు నన్నపనేని తెలిపారు.