విజయవాడ : విజయవాడ పడమట జిల్లాపరిషత్ బాలికల హైస్కూల్లో రాష్ట్ర స్థాయి ''మన ఊరు-మన బడి'' కార్యక్రమాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు.నేటి నుండి ఈ నెల 30తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మన బడి కార్యక్రమం ప్రారంభకానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభిచినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించేలా అధికారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించలన్నారు.