తిరుమల శ్రీవారిని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న రాఘవేంద్రరావుకు టిటిడి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అంజేశారు. తనను ఎస్వీబీసీ ఛైర్మన్గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.