కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 143వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 143వ రోజు పాదయాత్రను ఆగిరిపల్లి నుంచి ప్రారంభించారు. పాదయాత్ర చిన్న ఆగిరిపల్లి, తోటపల్లి, గొల్లన్నపల్లి, చిక్కవరం క్రాస్ మీదుగా గోపవరపుగూడెం వరకు కొనసాగనుంది.