‘రాజ్యాంగాన్ని రక్షించండి’ పేర కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో నేటినుంచి ప్రచారోద్యమాన్ని ప్రారంభించనున్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ హయాంలో రాజ్యాంగంపై, దళితులపై జరుగుతున్న దాడులను ప్రధానంగా ప్రజల దృష్టికి తీసుకురానున్నారు.