విజయవాడ : ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగడం కోసం 68 ఏళ్ల వయస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేపట్టడం హర్షణీయమని ప్రముఖ ఛెస్ క్రీడాకారిణి కోనేరు హంపి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడు చంద్రబాబు అని, రాజకీయాలకు అతీతంగా హోదా కోసం అందరూ పోరాడాల్సిన అవసరముందని ఆమె చెప్పారు.