అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై లేని పోని అబద్ధాలు చెబుతూ.. బీజేపీపై నిందలు వేస్తున్నార ని బీజేపీ నేత లక్ష్మీపతి రాజా. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన మాట వాస్తవమేనని, ఆ మాటకు ఏపీలోని అధికార పార్టీ కూడా అంగీకరించిందని చెప్పారు. అయితే, గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబుకు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.