క్రమశిక్షణ లేని వారికి ‘మా’లో సభ్యత్వం ఇవ్వరని నటుడు, ఎంపీ మురళీమోహన్ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన తప్పు అన్నారు. తాను ‘మా’ అధ్యక్షుడిగా ఉంటే నటి శ్రీరెడ్డికి సభ్యత్వం ఇవ్వనన్నారు. ప్రత్యేక హోదా కోసమని వైసీపీ ఎంపీల రాజీనామాలు ఓ డ్రామా అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి 25 మంది ఎంపీలను గెలిపిస్తే చంద్రబాబు ఏపీకి పూర్తి న్యాయం చేస్తారన్నారు. మా కోడలు రాజకీయాల్లోకి రావాలని రాలేదన్నారు. నియోజకవర్గంలో తాను అందుబాటులో లేని సమయంలో నా బదులు సేవలందించడానికి మా కోడలు వచ్చిందని పేర్కొన్నారు.