విజయవాడ : వారం రోజులపాటు పని చేస్తే తమకు 250 రూపాయిల కూలీ ఇస్తున్నారని ఉపాధి కూలీలు పాదయాత్ర చేస్తున్న వైకాపా అధినేత జగన్కు చెప్పారు. ఈదర గ్రామంలో ఉపాధి కూలీలు జగన్తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మంచినీరు, మజ్జిగ తదితర స ఔకర్యాలను ప్రభుత్వం కల్పించడం లేదన్నారు. కాగా ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు.