సెప్టెంబర్ 6నుంచి 8వరకు విశాఖలో టూర్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ… రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను టూర్ ఆపరేటర్లు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి 1100 మంది టూర్ ఆపరేటర్లు హాజరు కానున్నట్లు తెలిపారు. సమావేశానికి సీఎంతో పాటు మంత్రులు హాజరవుతారన్నారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలుంటాయన్నారు.