న్యూఢిల్లీ : కాషాయ ఉగ్రవాదం అన్నందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. మక్కా మసీదు పేలుడు కేసులో స్వామి అసిమానంద సహా ఐదుగురినీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా నిర్దారించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజపీ అధికార ప్రతినిధి సంబిత్ పత్రా ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడారు. హిందువులు అందరి అభివృద్ధి కోరుకుంటారనీ, వారిపై ఇష్టారీతిన వ్యాఖ్యానాలు చేయడం తగదని అన్నారు. కాషాయ ఉగ్రవాదం అన్న పదాన్ని వాడినందుకు రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, సుశీల్ కుమార్ షిండే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.