రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అప్పాయింట్ మెంట్ వైకాపా ఎంపీలకు అడిగీ అడగడంతోనే లభించింది. అదే తెలుగుదేశం ఎంపీలు రెండు రోజుల పాటు ఎంత ప్రయత్నించినా రామ్ నాథ్ కోవింద్ అప్పాయింట్ మెంట్ దొరకలేదు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వైకాపా ఎంపీలకు రామ్ నాథ్ కోవింద్ అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాపై వైకాపా ఎంపీలు రాష్ట్రపతికి విన్నవించనున్నారు. అయితే ఇది విషయంపై తెలుగుదేశం ఎంపీలు ఈ నెల5,6 తేదీలలో రాష్ట్రపతి అప్పాయింట్ మెంట్ కోసం ఎంతో ప్రయత్నించారు. అక్కడ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో వారు ప్రధాని నివాసం వద్ద ధర్నాకు ప్రయత్నించి అరెస్టయిన సంగతి విదితమే. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీలకు అప్పాయింట్ మెంట్ దొరకలేదు కానీ, అదే రాష్ట్ర విపక్ష ఎంపీలకు మాత్రం అడిగీ అడగకముందే అప్పాయింట్ మెంట్ దొరకడంపై తెలుగుదేశం వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.