-వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు
-రాష్ట్రంలో ఉపాధి కల్పనకు పెద్ద పీట
-సీఎం కృషితోనే స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
-రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు
ఒంగోలు, మేజర్న్యూస్ : తూర్పు రాయలసీమ శాసన మండలి ఎన్నికల పట్టభద్రుల ( చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం) నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వేమి రెడ్డి పట్టాభి రామిరెడ్డి, ఉపాద్యాయ ఎమ్మెల్సీ వాసుదేవనాయుడుల విజయా లను కాంక్షిస్తూ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మార్టూరులో రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లా డుతూ గడిచిన రెండున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో 10.54 లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. రెండున్నర ఏళ్లలో 3,53,536 మందికి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించ డం జరిగిం దన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి సైబరాబాద్ ను నిర్మించి 13 లక్షల మందికి సాప్టవేర్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. రాషా్టన్న్రి నాలెడ్జ హబ్గా తయారు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దే కృషి జరుగుతుందన్నారు. ఉద్యో గుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచడం జరిగింద న్నారు. పదవీ విరమణ చేసే ఉద్యోగులకు గ్రాడ్యుటీని 10 లక్షల నుంచి 12లక్షలకు పెంచడం జరిగిందని మంత్రి తెలిపారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగులకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించిం దన్నారు. లోటు బడ్జెట్తో రాష్ట్ర విభజనకు గురైన ప్రభుత్వం ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. దేశ, విదేశాల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయంటే కారణం మసర్ధుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటమేనన్నారు. సిఎన్బీసీ టీవీ 18 సంస్థ వారు ప్రకటిం చిన స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికైదంటే దాని వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవిరళ కృషి ఉందన్నారు. శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక సంస్థల, పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ శివరావు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.