అమేథీలో సమస్యలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానాలు అందరినీ ఆశ్చర్యచకితులను చేసి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. తన నియోజక వర్గంలో మూడు రోజుల పర్యటన కోసం రాహుల్ గాంధీ ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా అమేథీలోని ఒక పాఠశాల విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిని మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో చట్టాలను చేసిందని, అయితే అవి గ్రామాల్లో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించింది. దీనిపై రాహుల్ స్పందిస్తూ ఈ ప్రశ్న మోడీజీని అడగండని చెప్పారు. తాము అధికారంలో లేమని, తాము అధికారంలోకి వచ్చినప్పుడు తమను అడగాలని ఆయన అన్నారు.