న్యూఢిల్లి : బుందేల్ఖండ్ రక్షణ కారిడార్ ప్రాజెక్టు విషయమై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తర్ ప్రదేశ్ ముక్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చర్చలు జరిపారు. 20 వేల కోట్ల రూపాయిల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రకటించిన 20 రోజుల్లోనే బ్లూప్రింట్ తయారు చేశారని మె చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే బుందేల్ఖండ్ అనూహ్యమైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తుందని ఆమె అన్నారు.