ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్సార్‌ సీపీలో చేరిన వైకేఎస్‌, టెన్నీస్‌ క్రీడాకారుడు రెడ్డెప్ప ధవేజీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 12:49 AM

నరసాపురం,మేజర్‌న్యూస్‌ఃమాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సారధ్యం లో వైయస్‌ఆర్‌ పార్టీ గెలుపుకోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని వైకేఎస్‌ ( ఏడిద కోట సత్యనారాయణ)అన్నారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నరసాపురం పట్టణానికి చెందిన ప్రముఖడు వైకేఎస్‌  ,ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు, విధ్యావేత్త చినరెడ్డప్ప ధవేజీ,నరసాపురం ఆఫీ సర్‌‌స క్లబ్‌ సభ్యుడు పోలిశెట్టి మోహన్‌, నియోజకవర్గానికి చెందిన చామకూరి నాగేశ్వరావు, కొల్లాటి నాగరాజులు బుధవారం వైయస్‌ఆర్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాంట్‌ వద్ద ఆపార్టీ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బముగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసేది వైయస్‌ఆర్‌సిపి పార్టీనే అన్నారు.రాషా్టన్రికి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న రాజీలేని పోరాటం అభినందనీయమన్నారు.ఇదిలా ఉండగా మాజీ పార్లమెంటు సభ్యులు చేగొండి హరిరామజోగయ్యకు అత్యంత సన్నిహితునిగా వైకేఎస్‌కు మంచి పేరు ఉంది. వైకేఎస్‌ గతంలో కాంగ్రెస్‌, టిడిపిలలో పలు పదవులు చేసారు. వీరి వెంట ఆ పార్టీ నాయకులు పి.డి రాజు, బుడితి అనీల్‌ కుమార్‌, కావలి నాని,బుడితి సుమన్‌ , విధ్యార్ధి నాయకులు బుడితి అక్షయ్‌ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా వీరి చేరికతో ఆపార్టీ శ్రేణులలో ఆనందోత్సాహాలు నెలకొనాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com