న్యూఢిల్లి : బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని టిడిపి ఎంపిలు అన్నారు. అమిత్షా వ్యాఖ్యలు చూస్తుంటే బిజెపికి ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గ ఔరవం ఉందో అర్థమవుతోందని వారన్నారు. ఎంపిలను కించపరుస్తూ అమిత్షా వ్యాఖ్యలు చేయడం శోచనీయమని వారన్నారు. తాము నెల రోజులు ఆందోళన చేశామని వారు చెప్పారు. ఎపి హక్కులు కాపాడే వరకూ పోరాటం సాగిస్తామని వారన్నారు. రాజీనామాలు చేస్తే ఏం లాభమని గతంలో ప్రశ్నించిన వైకాపా అధినేత జగన్ ఇప్పుడు రాజీనామాల గురించి మాట్లాడుతున్నారని వారు ఎద్దేవా చేశారు. బిజెపితో లాలూచీ పడి వైకాపా కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని వారన్నారు.