న్యూఢిల్లీ : వైకాపా ఎంపీలు తమ రాజీనామాలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలులో కేంద్రం పూర్తిగా విఫలమైనందున రాజీనామాలు సమర్పిస్తున్నామని వారీ సందర్భంగా స్పీకర్ కు తెలిపారు. ఈ సందర్భంగా రాజీనామాలపై పునరాలించుకోవాలని స్పీకర్ ఎంపీలను కోరారు. సభలోనే ఉండి పోరాడాలని వారికి చెప్పారు.