అమరావతి : ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం కేంద్రంపై పోరాటాన్ని టీడీపీ ఉధృతం చేసింది. పార్లమెంటు సమావేశాల్లో ఏపీపై చర్చకు కేంద్రం నిరాకరిస్తున్న తీరుకు నిరసనగా అసెంబ్లీ సమావేశానికి సైకిల్పై వెళ్లాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఈ ఉదయం వెంకటపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించి సైకిల్ ర్యాలీనిముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వెంకటపాలెం నుంచి అసెంబ్లీ వరకు సీఎం సైకిల్పై వెళతారు. అలాగే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైకిళ్లపైనే అసెంబ్లీకి బయలుదేరారు.