న్యూఢిల్లి : కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం కళ్లు తెరిచే వరకూ పోరాటం సాగిస్తామని టిడిపి ఎంపిలు చెప్పారు. పార్లమెంటు ప్రాంగణంలో వారు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలక్షేపం చేస్తోందని వారు విమర్శించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ ప్రజలందరికీ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.