న్యూఢిల్లీ : పార్లమెంటు సెంట్రల్ మీడియాలో జాతీయ మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. తాము ఎన్డీయే నుంచి బయటకు రావడానికి దారి తీసిన పరిస్థితులను ఆయన కూలంకషంగా జాతీయ మీడియాకు వివరించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయనందునే తాము ముందుగా ప్రభుత్వం నుంచీ, ఆ తరువాత ఎన్డీయే నుంచీ బయటకు వచ్చినట్లు ఆయన చెప్పారు. కేంద్రం ఒక అవినీతి పార్టీని చేరదీస్తోందంటూ విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల అమలు చేయకుండా కేంద్రం ద్రోహం చేసిందని విరమ్శించారు.