తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది. ప్రైవేటు హోమాలు నిషేధం ఉన్న.. దర్జాగా ప్రైవేట్ వ్యక్తులు రాజరాజేశ్వరి దేవాలయం వద్ద హోమం చేపట్టారు. ఇంత జరుగుతున్నా..టీటీడీ విజిలెన్స్ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విశేషం. మరోవైపు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆలయ పూజారి చేతులెత్తేశారు. ప్రైవేటు హోమాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.