అమరావతి : యూసీలపై సమాధానం చెప్పాల్సింది ప్రధానేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం, రాజధాని నిర్మాణం, వెనుకబడిన జిల్లాలు ఇలా అన్నిటికీ యూసీలు పంపామని, యూసీలు పంపితే అవి తప్పు అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడుతున్నచంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా అడుగుతున్నాననీ, ప్రధాని సమాధానం చెప్పి తీరాలని అన్నారు.