అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు శాసన సభకు నల్ల బ్యాడ్జీతో హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. సచివాలయంలో ఉద్యోగులు సైతం నల్ల బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారు. మండలి విప్ బుద్దా వెంకన్న కూడా నల్ల కళ్లద్దాలు, నల్ల దుస్తులు ధరించి నల్ల కారులో సభకు వచ్చారు.