పుణెలో భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్టుకు ఆతిథ్యమిచ్చిన ఎంసీఏ స్టేడియం పిచ్ పేలవంగా ఉందని ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ నివేదిక ఇచ్చాడు. ఈ నివేదికను బీసీసీకి పంపామని.. 14 రోజుల్లో భారత బోర్డు స్పందించాల్సి ఉంటుందని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా మూడు రోజుల్లోపే విజయం సాధించిన సంగతి తెలిసిందే. పిచ్ నాణ్యత మీద సందేహాలు వ్యక్తం చేసిన బ్రాడ్.
అంతర్జాతీయ మ్యాచ్లకు ఇలాంటి వికెట్లు ఆమోదయోగ్యం కావని పేర్కొన్నాడు. బీసీసీఐ స్పందించిన తర్వాత ఐసీసీ ఈ పిచ్ విషయంలో హెచ్చరించడమో.. లేదా ఇంకేదైనా నిర్ణయం తీసుకోవడమో చేస్తుంది. భారత్లో పిచ్ తీరుపై విమర్శలు వ్యక్తమవడం.. ఐసీసీ హెచ్చరికలు జారీ చేయడం ఇది తొలిసారి కాదు. రెండేళ్ల కిందట భారత్-దక్షిణాఫ్రికా టెస్టు ఆతిథ్యమిచ్చిన నాగ్పుర్ పిచ్ కూడా చెత్తగా ఉందని రిఫరీ నివేదిక ఇచ్చాడు. ఆ మ్యాచ్ కూడా మూడు రోజుల్లోనే ముగిసింది. కానీ అప్పుడు ఫలితం భారత్కు అనుకూలంగా రాగా.. ఈసారి భారత్ చిత్తుగా ఓడింది.