తిరుమల శ్రీవారి ఆలయంలో అపచారం జరిగింది. నిన్న రాములోరి పట్టాభిషేకం సమయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం అర్చకుడి చేతిలోంచి జారి కిందపడింది. అపచారం జరగడంతో ఏకాంతంగా అర్చకులు పుణ్యాహవచనం, శాంతిహోమం నిర్వహించారు. వయోభారం మీరిన అర్చకులకు విధులు కేటాయించడంతోనే ఘటన చోటు చేసుకుందని టీటీడీ అభిప్రాయపడినట్లు సమాచారం.