అమరావతి : రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యతిచ్చామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… నాలుగేళ్లు అవమానాలు భరించా, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశామన్నారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. కానీ చివరకు ఏపీకి తీరని అన్యాయం చేశారన్నారు. కేంద్రానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని జగన్ మాపై విమర్శలు చేస్తే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. మిత్ర ధర్మం ఎలా పాటించాలో మాకు తెలుసన్నారు. కేంద్రం రాష్ట్రానికి సహకరించనందువల్లే తాము బయటకు రావాల్సి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా చేస్తామని రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు.