ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకోర్టులో ఊరట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 23, 2018, 03:21 PM

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. ఆప్ ఎమ్మెల్యేలపై విధించిన అనర్హత వేటును ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. ప్రతి ఒక కేసును నిశితంగా పరిశీలించి, ఆ తదుపరి నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్వాగతించారు. సత్యం గెలిచిందన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను అక్రమ పద్ధతిలో అనర్హతకు గురి చేశారన్నారు. ఢిల్లీ ప్రజలకు హైకోర్టు న్యాయాన్ని ప్రసాదించిందన్నారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో 67 సీట్లు ఆప్ పార్టీ ఖాతాలో ఉన్నాయి. ఎమ్మెల్యేలు లాభదాయకమైన పదవుల్లో ఉండరాదు అన్న నిబంధన ఆధారంగా ఆప్ ఎమ్మెల్యేలపై ఎన్నికల సంఘం ఇటీవల అనర్హత వేటు వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com