ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జోరు వానలోనూ జనంలోకి వెళ్లిన నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 10, 2022, 12:18 AM

తుపాను ప్రభావంతో ఓ వైపు జోరువాన... మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వైనం... అయినప్పటికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటన ఆగలేదు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలిలో శుక్రవారం 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. జోరు వానలోనూ ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 


ఏళ్లుగా వస్తున్న పెన్షన్లు సైతం తీసేస్తున్నారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి మద్దతు ఇవ్వడంలేదనే కారణంతో తమపై అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆకాశాన్నంటుతున్న ధరలు తగ్గాలంటే సీఎం జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని  పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు ఒక్కటి కూడా ఎమ్మెల్యే పరిష్కరించలేదని ఆరోపించారు. ఇదిలావుంటే లోకేశ్ పర్యటన ప్రారంభం అవుతుండగానే గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో లోకేశ్ చిమ్మచీకటిలోనూ గ్రామంలో తన పర్యటనని కొనసాగించారు. లోకేశ్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు కావాలనే కరెంటు కట్ చేయించారని టీడీపీ ఆరోపించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com