ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్రచందనం స్మగ్లింగ్‌ అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 21, 2018, 09:55 AM

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ అరికట్టేం దుకు పటిష్ట కార్యచరణ రూపొందించామని అటవీ శాఖ మంత్రి సిద్థా రాఘవరావు అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయను విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 193 ప్రాంతాల్లో బేస్‌ క్యాంప్స్‌, స్ట్రైక్‌ ఫోర్స్‌, 113 చెక్‌పోస్టులు, బోట్‌ పార్టీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇ - నిఘా ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పదేళ్ల కాలంలో 3816 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం విక్రయం ద్వారా కేవలం రూ 69.7 కోట్లు ఆదాయమే వచ్చిందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ టెండర్లు పిలిచి పారదర్శకంగా విక్రయిస్తున్నామని తెలిపారు. ఈ మూడున్నరేళ్లలో 5252 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం విక్రయం ద్వారా రూ 1231.4 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా 1412 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించేందుకు కేంద్రం అనుమతులు మంజూరు చేసిందన్నారు. అటవీ చట్టాలను రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేస్తున్నామని, వాటిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే అటవీ సిబ్బందికి అధునాతన ఆయుధాలను అందజేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com