అమరావతి: టాలీవుడ్ ఏపీకి హోదా కోసం ఎందుకు పోరాడదని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమల నటులు, పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు. హోదా ఉద్యమానికి ఎందుకు మద్దతివ్వరని ప్రశ్నించిన ఆయన తమిళనటుల్ని చూసైనా బుద్ది తెచ్చుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్లికట్టు ఉద్యమాన్ని నడిపింది తమిళనటులేనన్నారు. మీరు హాలీవుడ్ స్థాయి నటులు కాదని, హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్లకే పనికొస్తారని ఘాటుగా విమర్శించారు. ఏజ్ బార్ అయిన నటులూ మీకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని ప్రశ్నించారు. ఏపీకి హోదాకు తెలంగాణ సీఎం కుటుంబం కూడా మద్దతు పలికిందని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమల నటులు, పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు. అవార్డులు ఇవ్వకపోతే లొల్లి చేసే కళాకారులు ఏపీ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.