న్యూఢిల్లి : కేంద్ర ప్రభుత్వంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించాలని వైకాపా ఎంపి వైవి సుబ్బారెడ్డి కోరారు. సభ సజావుగా లేదనే పేరుతో వాయిదా వేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా సభలో గందరగోళం చెలరేగుతున్నప్పటికీ ఆర్థిక బిల్లును ఆమోదించారని ఆయన గుర్తు చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ కోసం తాము పట్టుబడతామని ఆయన చెప్పారు.