గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇవాళ 116వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారు. జగన్ తన 116వ రోజు పాదయాత్రను పెదనందిపాడు శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర రాజుపాలెం క్రాస్, పాలపర్రు, పరిటాలవారిపాలెం క్రాస్, అన్నవరం క్రాస్ మీదుగా ఉప్పలపాడు వరకు కొనసాగనుంది.