తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు, కాలినడక భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. వయోవృద్ధులు , వికలాంగులకు ఇవాళ శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. రేపు ఐదేళ్లలోపు చంటి పిల్లల తల్లిదండ్రులకు ఆలయ అధికారులు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు.