ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోదా కాదు నిధులే ముఖ్యం: పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 19, 2018, 04:57 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పెద్ద విషయం కాదనీ, నిధులే ముఖ్యమని పవన్ కల్యాణ్ అన్నారు. ఒక జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు ఆయనీ సమాధానం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం అవసరం అయితే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని చెప్పిన పవన్ కల్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదా కాదు నిధులే ముఖ్యమని జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం కలకలం రేపుతోంది. అలాగే పాలన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు రెండున్నర మార్కులు ఇచ్చిన పవన్ కల్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మాత్రం 6 మార్కులు ఇచ్చారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ కంటే దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఏడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని రాజకీయవేత్తగా మారిన అన్నారు. ఈ జిల్లాల పరిస్థితిని మెరుగుపరచాలంటే బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ స్థాయిలో నిధులివ్వాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించే వరకూ బీజేపీతో కలసి వేళ్లే ప్రశక్తే లేదని అన్నారు. ప్రత్యేక సాయం విషయంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని మోడీ సర్కార్ తో కుమ్మక్కైందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేయడంపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. బీజేపీతో పవన్ కల్యాణ్ కుమ్మక్కై తెలుగుదేశంపై విమర్శలు చేస్తున్నారన్నతెలుగుదేశం ఆరోపణలే నిజమనడానికి ఇదే తార్కానమని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com