న్యూఢిల్లీ : లోక్ సభను బీజేపీ ఏకపార్టీ ఎజెండాగా నడుపుతోందని తెలుగుదేశం ఎంపీ రామ్మోహననాయుడు అన్నారు. లోక్ సభ వాయిదా పడిన తరువాత పార్లమెంటు ఆవరణలో ఆయన మాట్లాడుతూ…నాలుగేళ్లు కలిసి ఉన్నా రాష్ట్రానికి వీసమెత్తు కూడా సాయం అందించకుండా…ఇప్పుడు మా బాధను సభలో చెప్పుకునే ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానం పెడుతే చర్చకు భయపడి ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు.