అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటం జరగాలని సిపిఎం నేత మధు అన్నారు. ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని ఆయన సూచించారు. సభలు, సమావేశాలు నిర్వహించాలని, బస్సు యాత్రలు, పాదయాత్రలు చేపట్టాలని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాటం చేసినా తాము మద్దతిస్తామని ఆయన చెప్పారు.