న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగిన నేపథ్యంలో జరిగే ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అమిత్ షా చర్చించనున్నారు. రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా నేతలకు షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. బీజేపీ ప్రభుత్వంపై లోక్సభలో నిన్న టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటిసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.