తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ఇస్రో చైర్మన్ శివన్ శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈసందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాబోయే రెండేళ్లలో ఇస్రో భారీ ప్రాజెక్ట్లు చేపట్టనుందన్నారు. అలాగే త్వరలోనే జీఎస్ఎల్వీ, చంద్రయాన్ ప్రయోగాలు జరగనున్నాయన్నారు. మత్స్యకారుల కోసం మొబైల్ నావిగేషవ్ యాప్ను అందుబాటులోకి తీసుకొస్తామని శివన్ తెలిపారు. కాగా... స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.