గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయోరియా బాధితులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కణ్యాళ్ నగరంలో డయోరియా కారణంగా ఇప్పటి వరకూ 14 మంది మరణించడం బాధాకరమని చెప్పారు. దాదాపు 200 మంది జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారనీ, వారికి మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులను కోరారు.