అమరావతి: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్లకు జనసేన పార్టీ అధినేత పవన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే పీతల సుజాత డిమాండ్ చేశారు. నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ప్రశ్నిస్తా అంటున్న పవన్ ముందు అన్నను ప్రశ్నించాలన్నారు. రాజ్యసభలో పోరాటం చేయనందుకు చిరంజీవిని ప్రశ్నించాలని సూచించారు. పవన్ కల్యాణ్ చిన్న ఇల్లు కోసం రెండు ఎకరాలు కావాల్సి వచ్చింది… రాష్ట్ర రాజధానికి ఇన్ని ఎకరాలు అవసరం అంటారా? అని ప్రశ్నించారు. పవన్కు రాజకీయ కౌంట్డౌన్ ప్రారంభమైందన్నారు.